మే 25 వైశాఖమాస ఆదివారం
కృష్ణపక్ష త్రయోదశి పగలు
1:50 వరకు తదుపరి చతుర్దశి
అశ్విని నక్షత్రం ఉదయం 9:20
వరకు తదుపరి భరణి నక్షత్రం
దుర్ముహూర్తం సాయంత్రం 4:40
నుండి 5:32 మద్ కలదు
మాస శివరాత్రి పర్వదినం కర్తరి
త్యాగం రోహిణి కార్తీ ప్రారంభం
పగలు 2 గంటల తర్వాత
ఆదివారం అశ్విని నక్షత్రం
ఆనందయుగం ద్రవ్యలాభం
భరణి కాలదండ యోగం
విజ్ఞము కనుక ఉదయం
9:20లో ప్రయాణాలు
అనుకూలం మానవుడు
ఎంత జ్ఞానం సంపాదించినా,
తెలుసుకోవలసినది
తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం
వృధాయే. తెలుసుకోవలసింది
తెలుసుకోవాలంటే దానికి శ్రద్ధ,
భక్తి ముఖ్యం. పరమాత్మను
చేరుకోవాలంటే గురువు మీద,
పరమాత్మ మీద శ్రద్ధ,
అచంచలమైన భక్తి, విశ్వాసము
కలిగి ఉండాలి. జపము,
ధ్యానము, కీర్తన, స్మరణ..
వీటితో భగవంతుని ఆరాధించాలి.
అప్పుడు భక్తునికి మంచి
బుద్ధి పుడుతుంది. మనస్సు
చెడు మార్గం నుండి మంచి
మార్గంలోకి మళ్లుతుంది.
గురువుల దగ్గర నుండి,
శాస్త్రములు పురాణముల
నుండి జ్ఞానము సంపాదిస్తాడు.
తరువాత తెలుసుకోవలసిన
పరమాత్మ గురించి తెలుసుకుంటాడు.
అదే ముక్తికి మార్గము.
దీనికి మూలము భక్తి, శ్రద్ధ,
అభ్యాసము. కనుక వీటిని ఎట్టి
పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం
చేయకూడదని గురువచనం
ఏడు రాశులలో 9 విగ్రహాలు
మాలికలాగా సంచారము
కనక ఎక్స్పోర్ట్ ఇంపార్టు సంబంధించి
వ్యాపారాలు విదేశీ ప్రయత్నాలు
అనుకూలం ముఖ్యంగా సింహ
తుల మకర రాశి వారికి
అనుకూలించును