ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.
శ్రావణశుక్ల సప్తమిని అవ్యంగవ్రతం అంటారు. శ్రీమహావిష్ణువును యథావిధిగా పూజించి, నాలుగు దోసిళ్ళ ప్రత్తిని ఆయన పాదాల దగ్గర ఇత్తడి పళ్ళెంలో ఉంచి, దానిని విప్రునకు దానం ఇచ్చే విధానాన్ని అవ్యంగవ్రతం అంటారు. ఇది అత్యంత శుభప్రదం